Thursday, 10 April 2025
యో మామేవ మసమ్మూఢో.
యో మామేవ మసమ్మూఢో జానాతి పురుషోత్తమం।
స సర్వ విద్భజతి మాం సర్వభవేన భారత॥19॥
శ్రీమద్భగవద్గీత...పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
శ్పీకృష్ణుడు అర్జునుడికి వివరం చెబుతున్నాడు.అర్జునా!ఓ భరతశ్రేష్టా!ఇక్కడ గందరగోళం ఏమీలేదు.ఎలాంటి అనుమానాలు,సంశయాలు,శంకలు,గిలులు లేకుండా నన్నే పరమాత్మగా గుర్తించాలి.అర్థం చేసుకోవాలి. ఆకళింపు చేసుకోవాలి.ఎందుకంటే నన్ను పూర్తిగా తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడు అవుతాడు.అతడు అన్ని విధాలా నా శరణులోకి వస్తాడు.నన్నే సేవిస్తాడు.ముక్తి పథంలో పయనిస్తాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment