Friday, 18 September 2026

తేషాం జ్ఞానీ నిత్యయుక్తః——-theshaam jnaanee nithya yukthah

తేషాం జ్ఞానీ నిత్య యుక్తః ఏక భక్తిర్విశిష్యతే। ప్రియో హి జ్ఞానినో త్యర్థ మహం స చ మమ ప్రియః॥17॥7॥ శ్రీ మద్భగవద్ గీత...విజ్ఞాన యోగము...శ్రీకృష్ణుడు అర్జునుడికి తనకు ఎవరు ఎక్కువ ఇష్టమో చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!నేను ఇప్పుడు చెప్పాను కదా నాలుగు రకాల మనుష్యులు నన్ను సేవిస్తారు అని.వాళ్ళు ఆపదలో ఉన్నవారు,జిజ్ఞాసువు,సంపదలు కోరేవాడు మరియు జ్ఞానీ అని తెలుసుకున్నాము కదా!వీళ్ళల్లో నాకు ఎవరంటే ఎక్కువ ఇష్టమనిపిస్తుంది నీకు?నేనే చెబుతాను,విను.వీళ్ళందరిలోకి జ్ఞాని నాకు ఎక్కువ ఇష్టము.ఎందుకంటావా?ఎందుకంటే జ్ఞాని అనేవాడు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నవాడు.ఎల్లప్పుడూ నాయందే మనసు నిలుపుకుని ఉంటాడు.ధ్యాన యోగముతో నన్ను సేవిస్తాడు.అందరిలోకి అతనే శ్రేష్టుడు.అతను నన్ను ప్రేమిస్తాడు,నాకు అతడు మిక్కిలి ఇష్టుడు. Theshaam jnaanee nithyayukthah yeka bhakthirvisishyathe/ Priyo hi jnaanino thyardha maham sa cha mama priyah//17///7// Sri madbhavadgeetha ....Vijnaana yogamu... Sri Krishna is explaining Arjuna whom he loves among his devotees.Hey Arjuna!hey brother!I told you just now as to who love me.Amongst all my devotees I feel a special bonding and affection towards the wise and knowledgeable person.The reason behind it is simple.Jnaani knows about me fully well.He concentrates on me and thinks about me all the time.He prays and serves me through dhyaanayoga.He is the best,efficient and the most eligible devotee of mine.I too reciprocate his love and affection in the most appropriate manner.

Wednesday, 16 September 2026

చతుర్విధా భజంతే ॥॥॥chathurvidhaa bhajanthe

చతుర్విధా భజంతే మాం జనా స్సుకృతినోఽర్జున। ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ॥16॥7॥ శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియపరుస్తున్నాడు.ఏమని?ఎవరెవరు తనను సేవిస్తారు అని.అర్జునా!భరతర్షభ!నన్ను నాలుగు రకాల మనుష్యులు సేవిస్తారు.వాళ్ళు ఎవరో వివరిస్తాను.ఆపదలలో చిక్కుకున్నవాడు అమ్మా!అని అరుస్తాడు.భగవంతుడే తనకు తల్లి,తండ్రి,గురువు,దైవము అని నమ్ముతాడు.ఏదో ఒక రూపంలో చేయూతను ఇస్తానని ఆశిస్తాడు.జ్ఞాని నన్ను సేవిస్తాడు.ఎందుకంటే తన జ్ఞాన నేత్రముతో నన్ను గుర్తిస్తాడు.నేను సర్వాంతర్యామిని,సర్వ వ్యాపకుడను అని తెలుసుకుంటాడు.కావున నాశరణు జొచ్చుతాడు.ఇక పోతే సంపదలు కోరుకునే వాడు నన్ను సేవిస్తాడు.తిట్టినా,పెట్టినా నేనే అనే విషయం వాడికి బాగా క్షుణ్ణంగా తెలుసు.జిజ్ఞాసువు జ్ఞాన పిపాసి.జ్ఞానం పూర్తిగా తెలుసుకోవాలనే అన్వేషణలో నిత్యం ఉంటాడు.జ్ఞాన సముపార్జన కోసం నన్ను సేవిస్తాడు.///// Chathurvidhaa bhajanthe maam janaa ssukruthinoarjuna/ Aartho jijnaasu rardhaardhee jnaanee cha bharatharshabha//16//7// Sreemadbhagavadgeetha...vijnaana yogamu... Sree Krishna is telling Arjuna what types of people worship him and want to be protected by Him.Arjuna!hey Bharatharshabha!people who are facing hardships in their lives come to me seeking help.Persons who are in search of knowledge that is profound seek my blessings.peole who want riches and wealth pray to me for fulfilment of their desires.An intelect and knowledgeable person knows and understands that I am the Supreme force behind everything.So,I am always in his prayers.These four categeries of people seek my blessings and proctection.

న మాం దుష్కృతినో మూఢాః///Na maam dushkruthino moodaah

న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః। మాయ యాఽపహృతా జ్ఞానాః ఆసురం భావ మాశ్రితాః॥15॥7॥ శ్రీమద్భగవద్గీత...।విజ్ఞాన యోగము... శ్రీ కృష్ణుడు అర్జునుడికి వివరం చెబుతున్నాడు.ఏమని?ఎవరు పడితే వాళ్ళు తనను ఆశ్రయించలేరని.అర్జునా!ఓ కిరీటీ!నేను ఇప్పుడే చెప్పాను కదా నన్ను శరణు జొచ్చిన వాళ్ళు మాత్రమే ఈ భవసాగరాన్ని ఈదగలుగుతారు అని.దీనికి ఇంకో మెళకువ కూడా ఉంది.ఎవరు పడితే వారు నన్ను ఆశ్రయించలేరు.వారు ఎవరో చెబుతాను,విను.రాక్షస ప్రవృత్తి,రాక్షస భావజాలము ఉండే వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉండవు.నిజంగా మేథావులు కారు,కానీ ఆ అపోహలో బతుకుతుంటారు ఒక వర్గం వాళ్ళు.వారికి నేనెప్పుడూ దక్కను.ఈ కోవలోకే ఇంకా చాలా మంది వస్తారు.దుష్కృతులు,అంటే తప్పు పనులు చేసేవాళ్ళు.వారి వలన మంచివారు మొత్తమూ బాధలు పడుతుంటారు.మూర్ఖులు ఇంకో తెగ.వీరికి విచక్షణా జ్ఞానము శూన్యము.వారు పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని వాదించే రకము.మరి ఇంకో వర్గము నీచులు.వీరు వారు అనుకున్నది సాథించేదానికి ఎంతటి నీచానికైనా ఒడి కడతారు.వారికి ఎలాంటి విలువలు,మంచి చెడు విశ్లేషణ ఉండదు.అర్జునా!పైన పేర్కొన్నవారు ఎవరూ నా దరిదాపుల్లోకి కూడా రాలేరు.నా ఆశ్రయం కోరడమూ,దక్కించుకోవడమూ కల్లే వారికి. ॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥ Na maam dushkruthino moodaah prapadyanthe naraadhamaah/ Maaya yaaapahrutha jnaanaah aasuran bhaava maasrithaah//15//7// Sree madbhagavadgeetha...Vijnaana yogamu... Sri Krishna is telling Arjuna like this.Arjuna!hey Kireeti!I told you just now that those who come under my shelter alone can cross the turbulant sea of materialism.But there are ifs and buts to this prospect.Certain types of people can not come to me for shelter or help.I will explain to you about them.Those with cruel and demonish behaviour and thought process are not allowed to come near me.Similarly,there is another section who falsely think they know everything,but in reality they know nothing.There are people who indulge in bad deeds and cause hardships to the good natured people.There is another section who are fools.They do not have the distinction between good and bad.They go to any length to achieve what they want.Then there is another section who have no morals.They do not have any respect towards others or have any self respect.They can stoop down to lowest levels to have their say. Arjuna!I abhor them and I do not allow them to come nearby.They can never come to me, seek my blessings,shelter or help.

Tuesday, 15 September 2026

దైవీ హ్యేషా గుణమయీ//daivee hyesha gunamayee

దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా। మామేవ యే ప్రపద్యంతే మాయా మేతాం తరంతి తే॥14॥7॥ శ్రీమద్భగవద్గీత ....విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి తన గురించి చెబుతూ,కొన్ని నిష్టుర సత్యాలు కూడా చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!నేను సృష్టించిన ఈ మాయ దివ్యమయినది,త్రిగుణాన్వితమూ అయినది.ఈ మాయ దాటడం చిన్న పిల్లల ఆట కాదు.చాలా కష్టమయిన మార్గము అనుసరించాలి.అంత సులభంగా దాటలేరు మానవులు.నన్ను నమ్మి,నా శరణు జొచ్చిన వారు మాత్రమే ఈ మాయను దాటి,తరించగలుగుతారు. ////:/// Daivee hyeshaa gunamayee mama maayaa durathyayaa/ Maameva ye prapadyanthe maayaamethaam tharanthi the//14//7// Sree madbhagavadgeetha....vijnaana yogamu... Lord Sree Krishna is telling Arjuna about himself.Hey Arjuna!hey Pardha!I am the One who created Maya.Maya is celestial and is composed of three traits.It is never easy to cross these emotions and get over them.To say the least,it is practically impossible.But,there is always a solution to each and every problem.Is it not?Those who have belief in me and who come to me with trust and prayers can definitely cross this churning and turbulant ocean of misery and hardships.

Monday, 14 September 2026

త్రిభి ర్గుణమయై ర్భావైః

త్రిభి ర్గుణమయై ర్భావై రేభి స్సర్వ మిదం జగత్। మోహితం నాభి జానాతి మామేభ్యః పర మవ్యయమ్॥13॥7॥ శ్రీమద్భగవద్గీత....విజ్ఞాన యోగము...శ్రీకృష్ణుడు అర్జునుడికి అసలు వ్యవహారం చెబుతున్నాడు.అర్జునా!ఓ కౌంతేయా!త్రిగుణాలు ఉన్నాయి అని చెప్పాను కదా!అవి నా సృజనే అని కూడా చెప్పాను కదా!ప్రపంచం మొత్తమూ ఈ సత్త్వరజస్తమో గుణాల భావాలతో సమ్మోహనము కాబడుతుంది.దాని పర్యవసానం ఎలా ఉంటుంది?ఏమి ఉంటుంది చెప్పు?అంతా గలబా గలబా!గందరగోళం!అంతే కదా!ఈ పరిస్థితులలో సర్వాతీతుడను,శాశ్వతుడను అయిన నన్ను తెలుసుకోవడమే గగనమవుతున్నది.అందరూ దిక్కులు చూస్తున్నారు.ఏ దిక్కు మొక్కాలో తెలియక!

Sunday, 13 September 2026

యే చైవ సాత్త్వికా భావా

యే చైవ సాత్త్వికా భావా రాజసా స్తామసాశ్చయే। మత్త ఏ వేతి తా న్విద్ధి న త్వహం తేషు తే మయి॥12॥7॥ శ్రీమద్భగవద్గీత....విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి తాను లేనిదే ఈ విశ్వం లేదు అని చెబుతున్నాడు.ఈ విశాల విశ్వంలోని ప్రతి అణువు తనదే,తన యందే ఉంది.ప్రతి చిన్న శ్వాస కానీ,అనుభూతి,భావ పరంపర కూడా అతని సృజనే అని చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!మనకు తెలుసు కదా గుణాలు ఎన్ని రకాలు అని.అవే సత్త్వ గుణము,రజో గుణము,తమో గుణములు.వాటి వాటి సంబంధించిన భావావేశాలు అన్నీ కూడా నా కల్పనే!అవన్నీ కూడా మానవుడిలో నా వల్లనే కలుగుతాయి.ఆ త్రిగుణాలు నా చెప్పు చేతల్లో ఉంటాయి,సర్వదా.కానీ నేను వాటన్నిటికీ అతీతమై ఉన్నాను.కాబట్టి వాటికి నేను కట్టుబడను,వాటి చేత చిక్కను.

Saturday, 12 September 2026

బలం బలవాతాం చాహం

బలం బలవతాం చాహం కామరాగ వివర్జితమ్। ధర్మా విరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ॥11॥7॥ శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి తన్ను ఇంకొన్ని విథాలుగా ప్రస్ఫుటమవుతాడో చెబుతున్నాడు.అర్జునుడిని సంబోథించడంలో కూడా అర్జునుడిపైన తనకున్న మక్కువ,అర్జునుడి గురించి తను ఏమనుకుంటున్నాడో తెలియకనే తెలుస్తుంది.భరత అంటే భరత వంశము.ఋషభ అంటే ఎద్దు.అది శక్తికి,గొప్పతనానికీ ప్రతీక.శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునుడు భరతవంశంలో ఋషభం లాగ శ్రేష్టుడు,గొప్పవాడు అని పొగుడుతున్నాడు.అర్జునా!ఓ భరతర్షభ!బలవంతులలో ఉండే కామరాగాలు లేని బలాన్ని నేను.ఈ సమస్త సృష్టిలో ఉండే ప్రతి జీవి లోని ధర్మ విరుద్ధం కాని కామాన్ని నేను.అనుభూతి పరంగా నేనే ఉంటాను,అవ్యయ పరంగా నేనే ఉన్నాను.అంటే గర్వము,అహంకారము లేకుండా ధర్మబద్ధమయిన శక్తి సామర్ధ్యాలకు ప్రతీక నేను.అలాగే సృష్టి కార్యంగా భావించి,పవిత్రంగా ఆచరించే కామాన్ని నేను.