Tuesday, 9 June 2026

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర స్సంయతేంద్రియః। జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేణాధి గచ్ఛతి॥39॥4॥ శ్రీమద్భగవద్గీత..।।జ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడి బుర్రలోకి తను చెప్పేది బాగా నిక్షిప్తం కావాలని పదే పదే చెబుతున్నాడు.అర్జునా!సఖా!నేను నీకు ఏమి చెప్పాను?ముందర ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అనే కదా!ఆ తరువాత ఏకాగ్ర చిత్తం సాధించాలి.అది ఎట్లా అంటావా?శ్రద్ధ,సహనాలతో ఏకగ్ర సాథన చేయవచ్చు.అంటే మనసు పట్టు తప్పకూడదు.ఒకే విషయం పైన దృష్టి పెట్టి,దానిని కైవశం చేసుకోవాలి.అలా చేసేవాడు జ్ఞానాన్ని పొందగలుగుతాడు.జ్ఞానాన్ని పొందిన కొద్ది కాలంలోనే మోక్షాన్నీ పొందగలుగుతాడు.ఎందుకంటే ఇవన్నీ ఒకదానితో ఇంకొకటి ముడిబడి ఉంటాయి.ఒక ముడి విప్పగలిగితే,ఇంకో ముడి సులభంగా విప్పవచ్చు.మొదలు పెట్టక ముందే గందరగోళంగా,మొదలు,కొస అర్థం కావడం లేదు అనిపిస్తుంది.అంటే నీకు ఏమనిపిస్తుంది?సహనము,దీక్ష,పట్టుదల,జిజ్ఞాస ఉంటే ఏమైనా సాథించ వచ్చు అనే కదా!

No comments:

Post a Comment