Tuesday, 30 June 2026

ఇహైవ తైర్జిత స్సర్గో

ఇహైవ తైర్జిత స్సర్గో యేషాం సామ్యే స్థితం మనః। నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మా ద్బ్రహ్మణి తే స్థితాః॥19॥5॥ శ్రీమద్భగవద్గీత...।కర్మ సన్న్యాస యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!పార్థా!నేను నీకు పండితుడు అనే వాడు ఎలా ఉండాలి అని చెప్పాను?పండితుడు అనేవాడు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు,చండాలుడు,ఆవు,కుక్క,ఏనుగు,ఇలా ఎంత తారతమ్యము ఉన్న ప్రాణి అయినా...అన్నిటి యందు,అందరినీ సమదృష్టితో చూస్తాడు,ప్రవర్తిస్తాడు అని కదా! అలాంటి పండితుడు ఈ జన్మలోనే సంసరాన్ని జయించిన వాడు అవుతాడు.అందరినీ,అంతటినీ సమంగా చూసేవాడు ఖచ్చితంగా సర్వ సమమయిన పరబ్రహ్మాన్ని చేరుకుంటాడు.అంటే కైవల్యం పొందుతాడు.ఇంతకంటే ఇంకేమి కావాలి,ఈ మానవ జన్మకు?

No comments:

Post a Comment