Saturday, 1 August 2026

యథా దీపో నివాతస్థో

యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా। యోగినో యత చిత్తస్య యుంజతో యోగ మాత్మనః॥19॥6॥ శ్రీమద్భగవద్గీత....ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రతి విషయమూ కూలంకషంగా,ఏ మాత్రమూ అనుమానానికి తావు లేకుండా చేయాలని నడుం బిగించాడు.అందుకే చెబుతున్నాడు.అర్జునా!ఓ కౌంతేయా!నేను ఏమి చెప్పాను?మనసు పరి పరి విథాలా పోకూడదు అని చెప్పాను కదా!నిశ్చలంగా,నిర్మలంగా ఉండాలని కూడా చెప్పాను కదా!దానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను,విను.మనం దీపం వెలిగించుకుంటాము కదా!గాలి వస్తే ఏమవుతుంది.ఆ వత్తి నుంచి వచ్చే వెలుగు గాలి ఏతట్టు వీస్తే ఆ తట్టుకు కదులుతుంది కదా!నిలకడగా ఉండదు కదా!అదే గాలి లేని చోట అయితే క్రమబద్ధంగా,నిలువుగా,నిటరుగా,ఒకే లంబంలో,నిశ్చలంగా వెలుగుతుంది కదా!యోగసాథకుడు కూడా అలాగే ఉండాలి.బయట విషయాలకు స్పందిస్తుంటే,మనసు నిలకడ ఉండదు.అవేవీ లేవు,తనను ఏమీ చేయలేవు,చేయకూడదు అని భీష్మించుకోవాలి.అప్పుడు అతని మనసు గాలి లేని చోట దీపములాగ చలించకుండా నిశ్చలంగా,యోగాభ్యాసానికి అనువుగా ఉంటుంది.