Saturday, 8 August 2026

శనై శ్శనై రుపరమేత్

శనై శ్శనై రుపరమే ద్బుద్ధ్యా ధృతి గృహీతయా। ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్॥25॥6॥ శ్రీమద్భగవద్గీత...ఆత్మ సంయమ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత వివరంగా,విపులంగా చెబుతున్నాడు.అర్జునా!ఓ మిత్రమా!మనం మనసుతో ఇంద్రియాలను నిగ్రహంలో ఉంచుకోవాలి.ఎందుకనంటావా?ఎందుకంటే క్షణికమయిన సుఖాలు ఉన్నాయి చూసావూ?రా!రా!సరసకు చేరా!అంటూ కన్ను గీటుతుంటాయి.ఊరిస్తూ ఉంటాయి.మనమంటే ఇంత ఇష్టమా?అని చొంగ కార్చుకుంటూ వాటి వెనక పరుగులు తీస్తాము.ఇంకేముంది?కాలు జారడాలో?ఊబిలో కూరుకుపోవడాలో?ఇంక అక్కడ నుంచి వెనకకు వచ్చే ప్రసక్తి ఉండదు.అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను.మనో నిగ్రహం అత్యంత అవసరము!ధీరుడుగా ఉందాము.ప్రాపంచిక విషయాల నుండి బుద్ధిని దూరంగా ఉంచుకుందాము.మనసును ఆత్మ యందే కుదురుగా ఉండేలా చూసుకుందాము,చేసుకుందాము.మనసు పరి పరి విథాలా పోతానంటుంది.కానీ దానిని అదుపులో పెట్టుకుందాము.కళ్ళాలు వేద్దాము.ఇలా వేరే ఆలోచనలు,చింతలూ లేకుండా జాగరూకతతో ఉందాము.

No comments:

Post a Comment