Tuesday, 23 June 2026

యుక్తః కర్మఫలం త్యక్త్వా

యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్ఠికీమ్। అయిక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే॥12॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి కొత్త కొత్త పదాలు ఆవిష్కరిస్తున్నాడు.అర్జునా!పార్థా!నేను నీకు ఇప్పుడు నైష్ఠికుడు గురించి చెబుతాను.ఒక మనిషి అచంచల దీక్ష,నియమము,నిబద్ధతతో తను పెట్టుకున్న వ్రతాలు,సిద్థాంతాలు,నియమాలు ఆచరించాలి.ఎక్కడా తడబడకూడదు.వేరేవాటిపైన దృష్టి పెట్టకూడదు.ధర్మశాస్త్రాలు,ఆశ్రమ ధర్మాలు తూచా తప్పకుండా ఆచరించాలి.అలాంటివారిని నైష్ఠికులు అని అంటారు. నైష్ఠికులు ఫలాపేక్ష లేకుండా కఠినమయిన నియమ నిబద్థతలతో,జీవిత ప్రామాణాలతో జీవనం కొనసాగిస్తారు.అలాంటి మానసిక,శారీరిక పట్టుదలతో కర్మలను ఆచరిస్తారు.కాబట్టే శాంతి పొందుతారు.అదే ఎక్కడ మోహం,కోపం,తాపం,తామసం కూడుతాయో,అక్కడ మానవుడు ఫలాపేక్షకు బందీ అవుతాడు.ఇంకేమి ఉంది?గానుగకు కట్టిన ఎద్దులాగ అక్కడక్కడే తనుచేసే కర్మలకు,కర్మఫలాలకు బద్ధుడు అవుతాడు.సంసార బంథాలకు బానిస అవుతాడు,బాథితుడు అవుతాడు,తనను తానే బంథించుకుంటాడు.

No comments:

Post a Comment