Monday, 29 June 2026

విద్యా వినయ సంపన్నే

విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని। శుని చైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః॥18॥5॥ శ్రీమద్భగవద్గీత...కర్మ సన్న్యాస యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి సమానత్వం గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!చీమనైనా,దోమనైనా..।మనిషినైనా,మృగాన్ని అయినా సృష్టించేది ఆ పరమాత్మే కదా!మనష్యులలో తేడాలు ఆయన కల్పించిన మాయ ద్వారానే కదా!అలాంటప్పుడు అందరూ సమానమే కదా!అమ్మ మనస్తత్త్వం ఎలా ఉంటుంది?పది మంది పిల్లలు ఉంటే అందరూ ఒకేలాగ ఉండరు కదా!కానీ అమ్మ అందరినీ సమానంగా చూస్తుంది కదా!ఒకడికి చీమిడి ముక్కులు కారుతున్నాయి అని అసహ్యించుకోదు.తన పమిటతోనే తుడుస్తుంది దగ్గరకు తీసుకుని.మెతకగా ఉండే బిడ్డకు ధైర్యం చెప్పి ముందుకు పంపిస్తుంది.తులవగా ఉండే బిడ్డను గదమాయించి,ఆపుతుంది.ఏ బిడ్డకు,ఎప్పుడు ఏమి కావాలో,ఏమి ఇవ్వాలో అమ్మకు తెలుసు. ఎక్కడో ఉండే దేముడు,ఇక్కడే ఉండే అమ్మ బిడ్డలను సమానంగా చూస్తున్నారు కదా!మనకేమి అంత బాథ అందరినీ సమానంగా చూసేదానికి? అలా అందరినీ,అంతటినీ సమానంగా చూడగలిగే వాడే పండితుడు.అర్జునా!ఉదాహరణకు చెబుతున్నాను.విద్యా వినయాలు గల బ్రాహ్మణుడు,చండాలుడు,ఆవు,కుక్క,ఏనుగు...ఈ సృష్టిలో ఉండే ప్రతి జీవినీ సమదృష్టితో చూస్తాడు పండితుడు.మనమూ అలా ఎందుకు ఉండకూడదు?

No comments:

Post a Comment