Wednesday, 1 April 2026

దేవాన్ భావయతాఽనేన

దేవాన్ భావయతాఽనేన తే దేవా భావయంతు వః। పరస్పరం భావయంతః శ్రేయః పర మవాప్స్యథ॥11॥3॥ శ్రీమద్భగవద్గీత ...కర్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి మందల వివరిస్తున్నాడు.అర్జునా!నేను చెప్పాను కదా బ్రహ్మ ప్రజలను సృష్టించినప్పుడే యజ్ఞాలను కూడా ప్రజా శ్రేయస్సు కోసం సృష్టించాడు అని.బ్రహ్మ ప్రజలకు ఇలా చెప్పాడు.మీరు యజ్ఞాలు చేయండి.వాటి ద్వారా దేవతలు తృప్తి చెందుతారు.వారు తృప్తి పొందితే మీకు తృప్తి కలిగిస్తారు.అంటే ఇచ్చుకుంటినమ్మా వాయనం అంటే పుచ్చుకుంటినమ్మా వాయనం లాగా అన్నమాట.మనం మంచి చేస్తే ఎదుటివాళ్ళుకూడా మనకు మంచి చేస్తారు.ఇలా సుహృద్భావంతో అన్యోన్యాచరణల ద్వారా శ్రేయస్సు పొందండి అని బ్రహ్మ ప్రజలను ఆశీర్వదించాడు.