Friday, 14 November 2025
ఏతాన్మాహాత్మ్య సంయుక్తం
ఏతాన్మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః।
సతత్ఫలమవాప్నోతి దుర్లభాం గతి మాప్నుయాత్॥22॥
భగవంతుడు మళ్ళీ మళ్ళీ నొక్కి చెబుతున్నాడు.ఎవరైతే గీతా శాస్త్రముతో పాటుగా గీతా మహత్మ్యము కూడా చదువుతారో వారు ధన్యులు.వారు పైన ఉదహరించిన రీతిగా గొప్ప గొప్ప ఫలితాలు పొందుతారు.అంతే కాకుండా మోక్షప్రాప్తికూడా సాథిస్తారు
గీతాయాః పఠనం కృత్వా
గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్।
వృథా పాఠో భవేత్తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః॥21॥
భగవంతుడు అయిన నారాయణుడు భూదేవికి చెబుతున్నాడు.ఓ భూదేవి!ప్రతి ఒక్కరూ భగవద్గీతను పారాయణం చేయాలి.దానితో పాటే ఈ మహాత్మ్యంకూడా చదవాలి.లేకపోతే ఆ పారాయణ వ్యర్థమవుతుంది.దాని ఫలము,ఫలితమూ ఆయాసమే కానీ ఫలదాయకము కాదు.
Wednesday, 12 November 2025
గీతామాశ్రిత్య బహవో
గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః।
నిర్దూత కల్మషాలోకే గీతాయాతాః పరం పదమ్॥20॥
భగవంతుడు భూదేవికి ఇలా చెబుతున్నాడు.ఓ భూదేవీ!నీకు ఈ విషయం తెలుసా!జనకుడు,ఇంకా చాలా మంది మహనీయులు గీతను ఆశ్రయించారు.ఒక రకంగా చెప్పాలంటే ఈ భగవద్గీతా శాస్త్రాన్ని ఆశ్రయించడం మూలానే వారు తమ పాపాలను ప్రక్షాళనం చేసుకోగలిగారు.పరమ పవిత్రమయిన పరమ పదాన్ని సునాయాసంగా పొందగలిగారు.
Tuesday, 11 November 2025
గీతార్థం ధ్యాయతే నిత్యం
గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః।
జీవన్ముక్తస్య విజ్ఞేయో దేహాంతే పరమం పదమ్॥19॥
మనుష్యులు పొద్దున లేచి ఏదో ఒక పనిలో నిమగ్నమవుతారు.ఈ పనులు చేసేవాళ్ళు గీతాపఠనానికి అర్హులు,ఇంకోరు కాదు అని ఏమీ లేదు.ఎటువంటి కర్మాచరణులు అయినా సరే ప్రతిదినమూ సార్ధకంగా గీతాపారాయణ చేయవచ్చు.అలా చేసే వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు.జ్ఞానవంతులు అవుతారు.చివరకు పరమపదాన్ని చేరుకుంటారు.
Sunday, 9 November 2025
గీతార్థ శ్రవణాసక్తో
గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయుతోపివా।
వైకుంఠం సమ వాప్నోతి విష్ణునా సహమోదతే॥18॥
విష్ణువు చెబుతున్నాడు.భూదేవీ!జీవితంలో ఎన్ని పాపాలు చేసినా సరే!భగవద్గీతను అర్థ యుక్తంగా వినేదానికి,చదివేదానికి శ్రద్థ,జిజ్ఞాస చూపిస్తే చాలు.వాడు ఖచ్చితంగా వైకుంఠాన్ని పొందుతాడు.అక్కడ విష్ణువు అనుభవించేవన్నీ తనూ అనుభవిస్తాడు.
అంటే దీని అర్థం చెబుతాను.భగవద్గీతా పఠనం సర్వపాప ప్రక్షాళనం చేస్తుంది.భగవద్గీతను నమ్ముకుంటే సరాసరి మోక్షానికి దారి కనుక్కున్నట్లే!
Saturday, 8 November 2025
గీతాభ్యాసం పునః కృత్వా
గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమామ్।
గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్॥17॥
భగవంతుడు అయిన శ్రీహరి ఇంకా ఇలా చెబుతున్నాడు.భగవద్గీత పారాయణము చేస్తూ మరణించిన వారు మరలా మనుష్య జన్మనే పొందుతారు అని చెప్పాను కదా!వారు మళ్ళీ మళ్ళీ జన్మలలో కూడా గీతాధ్యయనం కొనసాగిస్తారు.చివరకు మోక్షం ప్రాప్తం అవుతుంది.గీతను స్మరిస్తూ మరణించినవారు ఖచ్చితంగా సద్గతి పొందుతారు.
Friday, 7 November 2025
చంద్రలోక మవాప్నోతి
చంద్రలోక మవాప్నోతి వర్షాణా మయుతం ధృవమ్।
గీతాపాఠ సమాయుక్తో మృతోమానుషతాం వ్రజేత్॥16॥
భగవంతుడు భూదేవితో అంటున్నాడు.భూదేవీ!నీకు ఇంకా ఈ విషయం తెలుసా!అసలు నేను ఈ భగవద్గీత వల్లనే స్థిరుడుగా ఉన్నాను.భగవద్గీతలోనే,దాని సారంలోనే నేను నివసిస్తున్నాను.దీని మూలంగానే,దాని ఆధారంగానే,దీని పద్థతి ప్రకారంగానే నేను ముల్లోకాలనూ పాలిస్తున్నాను.
కాబట్టి గీతాధ్యయనం చేస్తూ మరణించినవారు మరలా ఉత్తమమయిన మానవ జన్మనే పొందుతారు.ముందర చెప్పినట్లు గీతలో కొసరంత రోజూ చదువుకుంటున్నా చంద్రలోకంలో పదివేల సంవత్సరాలు ఉంటారు.
Subscribe to:
Comments (Atom)