కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా స్సనాతనాః।
ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోఽభి భవత్యుత॥49॥1॥
శ్రీమద్భగవద్గీత..।అర్జున విషాద యోగము...
అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గర ఇలా వాపోతున్నాడు.కృష్ణా!నీకు కూడా తెలుసు కదా,కులక్షయం వలన కులాచారాలు నాశనమవుతాయి అని.కులాచారాలు భ్రష్టుపడితే కులం మొత్తం పాపపంకిలం అయిపోతుంది కదా!అధర్మం పేట్రేగిపోతుంది కదా!మంచి చెడ్డ అనే విచక్షణ కూకటి వ్రేళ్ళతో పీకివేయబడుతుంది కదా!కులము అనేది నాశనము అవుతుంది,లేక అంతరించి పోతుంది అంటే ఇక ప్రత్యామ్నాయము ఏమి ఉంది?
ఈ వినాశనాన్ని ఆపేదెలా?
No comments:
Post a Comment