Saturday, 24 January 2026
క్లైబ్యం మాస్మగమః పార్థ
క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వ య్యుపపద్యతే।
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప॥3॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
మాములుగా మనం ఏమి చేస్తాము?మనవాళ్ళు ఎవరైనా డోలాయమానంలో ఉంటే?మనకు మనమే కొంచెం పెద్దరికం తీసుకుంటాము.మనకు తెలిసినంతలో,మన విచక్షణా పరిథికి లోబడి మంచి చెడు చెబుతాము.సరైన నిర్ణయం తీసుకోమంటాము.ప్రక్కదారిలో,తప్పుదారిలో నడవద్దుఅని హితవు చెబుతాము.
అట్లాంటిది శ్రీకృష్ణుడికి తెలియని దిశా నిర్దేశమా?అతనికి తెలియని సమన్వయమా?
అర్జునుడికి హితవు చెప్పనారంభించాడు.
అర్జునా!ఎందుకు ఇంత గందరగోళం పడుతున్నావు?ఏదేదో ఊహించుకుని,ఇంకేదో తర్కం నీకు నువ్వు చెప్పుకుంటూ
సమయం వృధా చేయకు.
ఇలా నీవు పౌరుషాన్ని కోల్పోవడం నీకు అసలు తగని పని.ఎందుకు మానసికంగా డీలా పడిపోతావు?క్షుద్రమయిన హృదయ దౌర్బల్యాన్ని వదలి పెట్టు.అది నీకు తగదు.ససేమిరా నీకు వన్నె తీసుకురాదు.మనకంటూ ఒక బుద్ది,బుర్ర అనేవి ఉన్నాయి కదా!వాటిని వాడి తెలివి తెచ్చుకో!ముందర లెయ్యి!అలసత్త్వం మానుకో!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment