న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వాజయేమ యదివానో జయేయుః।
యానేవ హత్వా న జిజీవిషామ
స్తేవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః॥6॥2॥
శ్రీమద్భగవద్గీత...సాంఖ్య యోగము...
అర్జునుడు కృష్ణుడికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.కృష్ణా!ఒకటి ఆలోచించు.పోరు సల్పినపుడు విజయం ఎవరిని వరిస్తుందో తెలియదు.యుద్ధం చేసినా మనమే గెలుస్తామనే ధీమా లేదు.అంతోసి దానికి వారిని ఎందుకు చంపాలి?ఎవరిని చంపడం వలన మనకు జీవించాలనే ఇచ్ఛే అడుగంటి పోతుందో ....అటువంటి ధార్తరాష్ట్రులే కదా మన ఎదుట శత్రు పక్షాన ఉన్నది!ఇంక ఏమని అడుగు ముందుకు వేస్తాము?
No comments:
Post a Comment