Sunday, 4 January 2026

సంకరో నరకాయైవ

సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ। పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియాః॥42॥1॥ శ్రీమద్భగవద్గీత...అర్జున విషాద యోగము... అర్జునుడికి దుఃఖం,విచారమూ క్షణ క్షణానికీ ఎక్కువ అవుతున్నాయి.ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుని పోతున్నాడు.శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు.కృష్ణా!వర్ణసంకరం వలన ఎవరికి లాభం చెప్పు?అటు కర్తకూ,ఇటు కులానికీ...రెంటికీ నరకమే కదా దక్కేది.వీళ్ళు చేసే పాపపు పనుల వలన పితృదేవతలు కూడా క్షోభిస్తారు.ఎందుకంటే వారికి పిండోదకాలు పెట్టేవాళ్ళూ,తర్పణాలు వదిలేవారూ ఎవరూ మిగిలి ఉండరు కదా!చివరికి ఉండేవాళ్ళు,పుట్టబోయే వాళ్ళు,ఆఖరికీ ఎప్పుడో పోయిన పితృదేవతలు,వారి ఆత్మలు...అందరూ అధోగతులపాలవుతారు. ఇంత ఘోష,ఇంత పాపం చేయటం మనకు అవసరమా?

No comments:

Post a Comment