Sunday, 18 January 2026
సాంఖ్య యోగము…తం తథా కృపయా విష్ట
సంజయ ఉవాచ...
తం తథా కృపయా విష్ట మశ్రుపూర్ణాకులేక్షణమ్।
విషీదంత మిదం వాక్య మువాచ మధుసూదనః॥1॥2॥
సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు.రాజా!శ్రీకృష్ణుడు అర్జునుడు బాధ పడటం అంతా ఓపికగా విన్నాడు.అతని ముఖంలో,మస్తిష్కంలో మార్పులను గమనించాడు.
అర్జునుడు అందరూ అయ్యో పాపం!అనేలా ఉన్నాడు.అర్జునుడి హృదయం అంతా జాలి నిండి పోయి ఉంది.కళ్ళనిండా నీరు సుడులు తిరుగుతున్నాయి.హృదయవిదారకంగా రోదిస్తున్నాడు.అలాంటి స్థితిలో ఉన్న అర్జునుడిని ఉద్దేశించి శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment