సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం।
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ॥15॥
శ్రీమద్భగవద్గీత... త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము
కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఆ పరబ్రహ్మత్వం అనేది వుందే,అది ఎవరికీ అంత సులభంగా అర్థం కాదు.అది సర్వేంద్రియాలలో కలిసి ఉన్నట్లు కనిపిస్తుంది.కానీ కలవదు.దేనితో కలిసి వుండకపోయినా,అన్నిటినీ ధారణపోషణలు చేస్తూ ఉంటుంది.నిర్గుణమై ఉండి కూడా గుణాలను అనుభవించేది అదే.ఈ విషయం నువ్వు బాగా అర్థం చేసుకోవాలి,తెలుసుకోవాలి.
No comments:
Post a Comment