బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ।
సూక్ష్మత్వా త్తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్॥16॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము
అర్జునుడికి కృష్ణుడు ఓపికగా,అర్థం అయ్యేలా చెబుతున్నాడు.అర్జునా!ఈ పరబ్రహ్మము అనేది అన్ని భూతాలకు లోపల ఉంటుంది.అంతేకాదు! ఇది సర్వభూతాలకూ బయటకూడా ఉంటుంది.చరాచర స్వరూపం అదే.అయినా దానిని తెలుసుకోవడం అసాధ్యము.ఎందుకంటే అది అత్యంత సూక్ష్మమయినది.దానిని అథ్యయనం చేసి ,అర్థం చేసుకుని,గుర్తించిన వారికి అతి చేరువలో ఉంటుంది.అజ్ఞానులకు,మిడిమిడి జ్ఞానంతో మిడిసి పడేవారికి అందనంత దూరంలో ఉంటుంది.
No comments:
Post a Comment