Tuesday, 4 March 2025

ప్రకాశం చ ప్రవృత్తిం చ

శ్రీభగవానువాచ.... ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి॥22॥ ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యోఽవతిష్టతి నేంగతే॥23॥ సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మ కాంచనః తుల్య ప్రియాప్రియో ధీరః తుల్యనిందాత్మ సంస్తుతిః॥24॥ మానావమానయో స్తుల్యః తుల్యో మిత్రారి పక్షయోః సర్వారంభ పరిత్యాగీ గుణాతీత స్స ఉచ్యతే॥25॥ శ్రీమద్భగవద్గీత..।చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగయోగము ఎప్పుడూ అర్థం చేసుకోవాలి అనే తపన వుండే వాళ్ళకే అనుమానాలు వస్తాయి.అర్జునుడు తన అనుమానాలు బయచ పెట్టగానే కృష్ణుడు సంతోషించాడు.విడమరచి చెప్పడం మొదలు పెట్టాడు.హే అర్జునా!గుణాతీతుడు ఎవడు,ఎలా ఉంటాడో చెబుతాను,విను. ఈ మూడు గుణాలు ఉన్నాయి కదా!వాటికి సంబంథించిన,వ్యక్తరూపాలు అయిన ప్రకాశం,ప్రవృత్తి,మోహాలు సంప్రాప్తమయినా ద్వేషించకుండా ఉండాలి.అవి దక్కకపోయినా,వాటికోసం వెంపర్లాడకుండా వుండగలగాలి.నిర్వికారంగా,సాక్షిమాత్రుడుగా వుండాలి.గుణధర్మపరమయిన కర్మలకు తన కర్తృత్వాన్ని జోడించకుండా ఉండాలి.వాటివాటి స్వస్వభావతను గ్రహించి సుఖదుఃఖాలను రెండింటినీ సమభావంతో చూడాలి.తనకుతానే సుప్రతిష్టుడు అయి మట్టి,రాయి,బంగారాలను సమభావంతో చూడగలగాలి.ప్రియమైనా,అప్రియమైనా ఒకే రకంగా స్వీకరించాలి.ధీరుడుగా ఉంటూ నిందలు అయినా,మెచ్చుకోలుఅయినా,బ్రహ్మరథం పట్టినా,అవమానించినా,శత్రువులు అయినా,మిత్రులు అయినా సమభావంతో స్వీకరించాలి.సర్వకాల సర్వావస్థలయందు సమబుద్ధితో వుండి,నిస్సంకల్పుడుగా ఉండాలి.ఇలా వుండగలిగిన వాళ్ళను గుణాతీతుడు అంటారు.

No comments:

Post a Comment