కస్మాచ్చ తే నమేరన్ మహాత్మన్
గరీయసే బ్రహ్మణోఽప్యాదికర్త్రే
అనంత దేవేశ జగన్నివాస!
త్వమక్షరం సదసత్తత్పరం యత్॥37-11
విశ్వరూప సందర్శన యోగము
అర్జునుడు కృష్ణుడిని పొగుడుతున్నాడు.అతని గొప్పదనంతెలిసింది.తనకు దిశా నిర్దేశం చేసేది అతనే అని అర్ధం అయింది.
మహాత్మా!నీవు సృష్టికర్త అయిన బ్రహ్మకే మూలపురుషుడవు.నీకు నమస్కరించని వాళ్ళు ఎవరు వుంటారు?హే అనంతా!హే జగన్నివాసా!సత్తువు,అసత్తువు రెండింటికీ మూల కారణం నీవే.నిశ్చల మైనది,శాశ్వతనైనది సత్తు.మార్పునకు లోనయ్యేది,అశాశ్వతనైనది అసత్తు.
No comments:
Post a Comment