Monday 29 July 2024

కర్మణ్యే వాధికారస్తే

కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి//47-2---సాంఖ్యయోగము మనకందరికీ యావ ఎక్కువ.ఏదైనా పని చేస్తే మనకేంది లాభం?ఓకవేళ లాభం వుంది అంటే ఎంత లాభం?ఎంతో కొంత వుంది అంటే ఇంకొంచెం పెరిగే ఆస్కారం వుందా?అసలు మొత్తం లాభం నాకే రావాలి.దాంట్లో ఇంకెవరికీ భాగం ఉండకూడదు అని అనుకుంటాము.కానీ ఇక్కడేమో కర్మలు చేయటమే మన పని.దాని పైన మనకు ఎలాంటి అధికారం లేదు.దాని వల్ల కలిగే లాభాలకు ఆశ పడొద్దు.అసలు ఆ లాభాలు మనకు వద్దనే వద్దు అంటున్నారు.ఇది సాధ్యమా?కానీ గీత మనలని సాధ్యం చేసుకోమంటుంది.లేకపోతే పుట్టినప్పటినుంచి పోయే దాకా ప్రతిదీ వ్యాపారం అయిపోతుంది.బంధాలు అనుబంధాలు ఉండవు.ప్రేమలు,అభిమానాలు ఉండవు.మనసుకి ప్రశాంతత వుండదు.ఎంత సేపు ఏదో ఒకటి సాధించాలని పరుగెత్తుతూనే వుంటాము.జీవితానికి ఒక అర్థం పరమార్ధం ఉండదు.జీవితం లో ప్రశాంతత ఉండాలంటే ప్రతిఫలాపేక్ష లేకుండా మన పనులు మనం చేసుకుంటూ పోతుండాలి.పనులు చేస్తుంటే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి.లాభమయినా నష్టమయినా ఒకే రకంగా తీసుకోగలగాలి.మనము చేసేపని మంచిదయితే మంచి ఫలితాలు ఉంటాయి.చెడు పనులు అయితే చెడు ఫలితాలు ఉంటాయి.గర్వానికి పోకూడదు. మనం నిమిత్త మాత్రులము అనే విషయము సర్వ కాల సర్వావస్థల యందు గుర్తు పెట్టుకోవాలి. కృష్ణుడు ఏమి చెప్తున్నాడంటే,ఫలితం పైన హక్కు లేదని అసలు పనులు చేయడం ఆపొద్దు.నీ విధులు నీవు సక్రమంగా నిర్వర్తించు.లాభాపేక్షతో పనులు చేయవద్దు.

No comments:

Post a Comment