Wednesday 31 July 2024

యదా యదా హి ధర్మస్య

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన మధర్మస్య తదాఽఽత్మానం సృజామ్యహం//7-4 జ్ఞాన యోగము ప్రకృతి ఎప్పుడూ తనను తాను రక్షించుకుంటుంది.మనం దాని సమతుల్యతకు భగ్నం కలిగిస్తే ,అది దాని మూడో కన్ను తెరిచి విధ్వంసం సృష్టిస్తుంది.విలయ తాండవం చేస్తుంది.అప్పుడు మనం ఎంత లబో దిబో మన్నా లాభం లేదు.పరిగెత్తడానికి ఏ చోటు మిగిలి వుండదు,తల దాచుకునే దానికి ఏ కప్పూ ఉండదు.ధర్మం నశిస్తే నాశనం ఖాయం.అధర్మం,అరాచకం పెరిగితే లెక్క సరిచూసుకుంటుంది ఈ ప్రకృతి.ఇక్కడ కృష్ణుడు ప్రకృతికి పరాకాష్ఠ గా చెప్పుకుంటున్నాడు.అన్యాయం ఎక్కడ జరిగినా తట్టుకోను,ఒప్పుకోను,తాట తీస్తాను అంటున్నాడు.

No comments:

Post a Comment