Thursday 8 August 2024

అపరేయ మితాస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్

అపరేయ మితాస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవ భూతాం మహాబాహో య యేదమ్ ధార్యతే జగత్//5-7 విజ్ఞాన యోగము భగవంతుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అపరా అనే ఈ ప్రకృతి హేయమయినది.అంటే తక్కువ,నీచము అని అర్థం వస్తుంది.ఎందుకంటే ఇది మాయా మొహాలతో నిండి వుంది.ఇక్కడ కోరికలకు అంతం ఉండదు.కోపాలకు అంతం ఉండదు.జీవరూపమయిన ఈ విశ్వాన్ని అంతా భరించేది భగవంతుడి పరా ప్రకృతి.ఈ ప్రకృతి చాలా ఉత్కృష్టమయినది.చాలా గొప్పది.మానవుడు ముందర ఈ విషయాన్ని తెలుసుకోవాలి.మనలని భరించేవాడు ఆ పరమాత్ముడు ఒకడు ఉన్నాడు.అతడే మనకు తల్లి,తండ్రి,గురువు,దైవము.అతన్ని నమ్ముకుంటే,అతన్ని ఆశ్రయిస్తే,అతన్ని ధ్యానిస్తే ముక్తికి సోపానం వేసిన వాళ్ళము అవుతాము.

No comments:

Post a Comment