Tuesday 13 August 2024

మయా తత మిదం సర్వం

మయా తత మిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః॥4-9 రాజవిద్యా రాజగుహ్య యోగము భగవంతుడు నిరాకారుడు.కానీ ఈ సృష్ఠి అంతా వ్యాపించి వున్నాడు.ఈ చరాచర జగత్తు మొత్తము అతని యందే వుంది.కానీ వాటిలో అతను వుండడు.అతనే ఈ సమస్త సృష్టిని పెంచి పోషిస్తూ వుంటాడు.కానీ ఈ ప్రాణికోటి అతనిని అంటిపెట్టుకుని వుండదు.అన్ని చోట్ల వ్యాపించే వాయువు ఆకాశంలోనే వుంటుంది.అలాగే జీవకోటి మొత్తం భగవంతుడిలోనే లీనమై వుంటుంది. భగవంతుడంతటి వాడే,అన్నీ తన గుప్పెటలో వున్నా,తటస్ధంగా వున్నాడు.అంటీ,ముట్టనట్టు వున్నాడు.ఈతత్త్వాన్నే తామరాకు మీద నీటి బొట్టు చందం అంటాము.తామరాకు నీళ్ళలోనే వుంటుంది.కానీ నీటి బిందువులు దాని పైన పడ్డా తడవదు.మనము కూడా అలాగే ప్రాపంచిక విషయాలలో వున్నా ఆసక్తి పరమాత్మ పైనే నిలపాలి.

No comments:

Post a Comment