జరా మరణ మోక్షాయ మా మాశ్రిత్య యతంతి యే
తే బ్రహ్మ తద్విదుః కృత్స్న మధ్యాత్మం కర్మచాఖిలం॥29-7 విజ్ఞాన యోగము
మనిషిని ఎక్కువ భయపెట్టేది ఏంది?మరణం,ముసలితనం.ఆ భయం నుంచి బయటపడాలి అంటే ఏమి చెయ్యాలి మనం?సుఖదుఃఖాలను సమంగా తీసుకోగలగాలి.తామరాకు మీద నీటి బొట్టు చందంగా అన్ని కర్మలు చేస్తున్నా వాటి ఫలితాల పైన ఎలాంటి మోహం లేకుండా వుండగలగాలి.అధిభూతము,అధిదైవము,అధియజ్ఞములకు మూలము అయిన ఆపరమేశ్వరుని ఆశ్రయించి సేవించాలి.అప్పుడు మరణం శరీరానికే కానీ,ఆత్మకు కాదు అని తేటతెల్లమవుతుంది.అప్పుడే మనం కర్మ తత్త్వాన్నీ,పరబ్రహ్మను తెలుసుకోగలుగుతాము.
No comments:
Post a Comment