Friday 9 August 2024

చతుర్విధా భజంతే మాం

చతుర్విధా భజంతే మాం జనా స్సుకృతినోఽర్జున ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ॥16-7 విజ్ఞాన యోగము నాలుగు రకాల మనుష్యులు భగవంతుడిని తెలుసుకోవాలని తాపత్రయ పడతారు.నమ్ముతారు.అతనిని సేవిస్తూ తరిస్తారు.వాళ్ళెవరో ఇప్పుడు తెలుసుకుందాము.కష్టాలలో ఉండేవాళ్ళు,ఏ దిక్కూ లేని వాళ్ళు దేవుడిని నమ్మి,సేవిస్తారు.దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు అంటాము కదా మనము.జ్ఞాన పరంగా ఆసక్తి,అన్వేషణ చేసే వర్గం.వీళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి శోధిస్తూ,సాధిస్తూ ఉంటారు.ఇంకా,ఇంకా తెలుసుకోవాలి అనే తపనతో రగిలి పోతుంటారు.వీళ్ళు భగవంతుడి గురించి తెలుసుకుని,సేవిస్తూ ఉంటారు.మూడో రకం మనుష్యులు ఎవరంటే సంపదలు కోరుకునే వాళ్ళు.వీళ్ళు జ్ఞాన సంపద కంటే,భౌతిక సంపదల కోసం ప్రాకులాడే వాళ్ళు.నాలుగో రకం,జ్ఞానులు. వీళ్ళు అన్నీ కూలంకషంగా తెలుసుకుని,పరిశోధించి,ఆ తరువాత మనసా వాచా నమ్మి భగవంతుడిని సేవలో ధన్యం అవుతారు.భగవంతుడికి కూడా వీళ్ళు అంటేనే ఎక్కువ ఇష్టం.

No comments:

Post a Comment