మనుష్యాణాం సహస్రేషు కశ్చి ద్యతతి సిద్ధయే
యతతా మపి సిద్ధానాం కశ్చిన్మామ్ వేత్తి తత్త్వతః॥3-7 విజ్ఞాన యోగము
ఒక పోటీ జరుగుతుంది అనుకుందాము.పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ మొదట రారు కదా!వెనక పడేదానికి సవా లక్ష కారణాలు వుంటాయి.సత్తా వున్నా ఆ క్షణం బుర్ర,శరీరం పని చెయ్యవు.కొంత మందికి పరిస్థితులు కలసిరావు.
అలాగే మోక్షం కోసం ప్రయత్నించే వాళ్ళలో కూడా అందరూ కూడా సాథించలేరు.వెయ్యి మందిలో ఒక్కరే మోక్షం కోసరము ప్రయత్నిస్తున్నాడు.అటువంటి వేయి మంది యతులలో ఏదో ఒకరే భగవంతుడిని తెలుసుకోగలుగుతున్నారు.కాబట్టి మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి.
No comments:
Post a Comment