పితాఽసి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్
న త్వత్సమోఽస్త్యభ్యధికః కుతోఽన్యో
లోకత్రయేఽప్య ప్రతిమప్రభావ!॥43॥
శ్రీ మద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము 11
అర్జునుడికి చిన్న చిన్నగా అర్థం అవుతుంది.కృష్ణుడు సామాన్యుడు కాదు,అసమాన్యుడు అని.అందుకే తన మనసులో భావాలను ఇలా వ్యక్తపరుస్తున్నాడు.హే కృష్ణా!ఈ జగత్తుకు నీవే తండ్రివి.నీవే పూజనీయుడివి.అగ్ర తాంబూలం తాసుకునే దానికి అర్హుడివి.ఆది గురువువు నీవు.నీకు సరి సమానమైనవాడు ఈ ముల్లోకాలలో ఎవరూ కానరావటం లేదు.నీకు సరి సమానమైన వాడే లేడంటే,నీకంటే గొప్పవాడు,నీకంటే అధికుడు ఇంకెక్కడ వుంటాడు?
No comments:
Post a Comment