శ్రీ భగవానువాచ...
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే।
శ్రద్ధయా పరయోపేతా స్తే మే యుక్తతమా మతాః॥2॥
శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము
భక్తి యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా సమాథానం ఇస్తున్నాడు.సతతం,నిర్వికారంగా నన్నే మనసులో కొలవాలి.మనసు పరిపరి విథాలుగా ప్రక్కకు పోకుండా ఏకాగ్ర చిత్తంతో నన్ను ఉపాసన చెయ్యాలి.ఎవరైతే వారి మనసులలో నన్ను సదా నిలుపు కుంటూ,ఉపాసన చేస్తారో,అలాంటి భక్తులే శ్రేష్టమయిన యోగులు.
No comments:
Post a Comment