యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః।
హర్షమర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః॥15॥
శ్రీమద్భగవద్గీత...ద్వాదశాధ్యాయము
భక్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి తన మనసులో మాట చెపుతున్నాడు.అర్జునా!నాకు అందరి కంటే ఎవరు ఇష్టమో తెలుసా?అతను లోకంలోని ప్రాణికోటిని భయభ్రాంతులకు గురి చేయకూడదు.అట్లా అని తాను కూడా లోకానికి భయపడకూడదు.సుఖదుఃఖాలకు,ఆనందం,ద్వేషం,అసూయలకు అతీతంగా ఉండాలి.భయాందోళనలకు దూరంగా ఉండాలి.చిత్తచాంచల్యానికి ఆమడ దూరంలో ఉండాలి.ఇలాంటి మోహ,తామస గుణరహితుడు నా మనసుకు దగ్గర అవుతాడు.
No comments:
Post a Comment