Thursday, 12 June 2025

ఓం తత్సదితి నిర్దేశో

ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ స్త్రివిధ స్మృతః। బ్రాహ్మణాస్తేన వేదశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా॥23॥ శ్రీమద్భగవద్గీత...సప్తగశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఓం,తత్,సత్ అనే మూడు సంకేత పదాలు బ్రహ్మజ్ఞతకు సాధనాలుగా నిర్దేశించ బడినాయి.ఆ నిర్దేశాల వలనే వేదాలు,యజ్ఞాలు,బ్రాహ్మణులు కల్పించ బడటం జరిగింది. ఓం అనేది బీజాక్షరం.ఓంకారం తోటే ఈ సృష్టి మొత్తం ఉద్భవించింది.కాబట్టి ఆ ఉచ్ఛారణ,ఆ అక్షరమూ మనకు చాలా పవిత్రమయినది.ఓం తత్సత్ అంటే సర్వోచ్ఛమయిన వాస్తవికత.అదే నిజం.ఏది వాస్తవికమయినదో అదే నిజం,అదే సంపూర్ణం.భగవంతుడే నిత్యమూ,సత్యమూ కాబట్టి ఆతని స్పృహలో ఉండాలి ప్రతి ఒక్కరూ.

No comments:

Post a Comment