Monday, 2 June 2025

విధిహీనమసృష్టాన్నం

విధిహీనమసృష్టాన్నం మన్త్రహీనమదక్షిణమ్। శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే॥13॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి తామస యజ్ఞం గురించి చెబుతున్నాడు.అర్జునా!ఇప్పుడు మనము తామస యజ్ఞం గురించి మాట్లాడుకుందాము.తామసులు ప్రతిపనిని మౌళికంగా శ్రద్ధా,నిష్టా,నియమాలు లేకుండా చేపడతారు.శాస్త్రాన్ని అనుసరించి చేయరు.కాబట్టి ఏ కోశానా శాస్త్రవిధి కానరాదు.యజ్ఞం కాగానే అన్నదానం చేయటం సర్వత్రా శుభదాయకం.కానీ వీరు ఆ జోలికి పోరు.మంత్రం యొక్క పవిత్రత గుర్తించి ఆచరించరు.యజ్ఞ యాగాదులు చేసిన పిదప వచ్చిన వారికి దక్షిణ తాంబూలాలు ఇవ్వటం ఆచరణ యోగ్యం.కానీ వీరు దానిని ససేమిరా ఆచరించరు. అంటే పద్ధతి ప్రకారం ఏదీ చేపట్టరు.చేసే ప్రతి పనినీ అహంకార పూరితంగా,అజ్ఞానంతో,లెక్కలేనితనంతో చేస్తారు.

No comments:

Post a Comment