Tuesday, 24 June 2025

నియతస్య తు సన్న్యాసః

నియతస్య తు సన్న్యాసః కర్మణో నోపపద్యతే। మోహాత్తస్య పరిత్యాగ స్తామసఽ పరికీర్తితః॥7॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్షసన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏది మంచో,ఏది కాదో ఓపికగా,నిదానంగా,అర్థం అయ్యేలా వివరిస్తున్నాడు.అర్జునా!ఎప్పుడూ ప్రతి ఒక్కరికీ విద్యుక్త కర్మలు,ధర్మాలు కొన్ని నిర్దేశితంగా ఉంటాయి.మానవుడు వాటినన్నిటినీ శ్రద్ధగా ఆచరించాలి.త్యాగం అన్నారని ఆ విద్యుక్త కర్మలను ఎప్పుడూ విడనాడకూడదు.అలాంటి త్యాగము ఎప్పటికీ న్యాయం,ధర్మము కాదు.ఎలాంటి శాస్త్రీయమయిన విశ్లేషణ,అవగాహన లేకుండా,పర్యవసానాలు ఆలోచించకుండా చేసే త్యాగము మూర్ఖత్వము అవుతుంది.దానినే తామస పరిత్యాగము అంటారు.

No comments:

Post a Comment