శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః।
అఫలాకాంక్షిభిర్యుక్తై స్సాత్త్వికం పరిచక్షతే॥17॥
శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి క్లుప్తంగా సాత్త్విక తపస్సు గురించి చెబుతున్నాడు.అర్జునా!మనం చేసే ప్రతిపనిలోనూ ప్రతిఫలం ఆశించకూడదు.మనసును నిర్మలంగా,నిశ్చలంగా ఎల్లప్పుడూ ఉంచుకోగలగాలి.చేసే ప్రతి పనిని శ్రద్ధాసక్తులతో చేయాలి.ఈ మూడు కార్యాలను నియమ నిష్ఠలతో ఆచరించడమే మూడు రకాల సాత్త్విక తపస్సు అంటారు.సాత్త్వికమంటే ఇంతకంటే వేరే ఇంకేమీ లేదు.
No comments:
Post a Comment