పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్।
కారణం గుణసంగోఽస్య సదసద్యోని జన్మసు॥22॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి సవివరంగా చెబుతున్నాడు.అర్జునా!ఈజీవుడు అనే వాడు ఉన్నాడు కదా!వాడు ప్రకృతికృత దేహగతుడు.అంటే ఈప్రకృతి ఇచ్చిన దేహం కలవాడు.అయినాకూడా అదే ప్రకృతిచే ఉత్పాదితాలు అయిన గుణాలవలన సుఖదుఃఖాలు,ఇతరమయిన క్లేశాలు అనుభవిస్తున్నాడు.వివిధ,పలు రకాల యోనులందలి జన్మలకు గుణ సంగమమే కారణము.అంటే ప్రకృతి మన దేహాలకు కారణభూతము అవుతుంది.అలాగే మనలో పుట్టే రకరకాల గుణాల వల్ల ఉత్పన్నమయే సుఖదుఃఖాలకూ కారణభూతము అవుతుంది.
No comments:
Post a Comment