మమ యోని ర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం/
సంభవ న్నర్వభూతానాం తతో భవతి భారత॥3||
శ్రీమద్భగవద్గీత...చతుర్దశాధ్యాయము
గుణత్రయ విభాగయోగము
భగవంతుడు అయిన కృష్ణుడు అర్జునుడికి అభిమానంతో చెబుతున్నాడు.అర్జునా!ఓ భరతశ్రేష్టా!త్రిగుణాత్మకము అయిన మాయ అనే ప్రకృతి నాకు గర్భస్థానము.ప్రకృతిలో క్షేత్రబీజాలను నాటి సర్వ ప్రాణి కోటినీ సృష్టిస్తాను.అంటే ప్రకృతి గర్భం అయితే నేను బీజము అయి సర్వ సృష్టికి మూలకారణం అవుతున్నాము.
No comments:
Post a Comment