అన్యే త్వేవ మజానంతః శ్రుత్వాఽన్యేభ్య ఉపాసతే।
తేఽపి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః॥26॥
శ్రీమద్భగవద్గీత..।త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము
శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆత్మతత్త్వము అనేది అందరికీ సులభంగా అర్థం కాదు కదా!అలా స్వతహాగా అర్థంచేసుకోలేని కొందరు తత్త్వజ్ఞానుల వద్ద ఉపాసన చేస్తున్నారు.ఇలా ఆత్మతత్త్వం గురించి తెలియకపోయినా,మనసా,వాచా,కర్మణా అభ్యాసం చేసేవారు కూడా మృత్యురూపమయిన సంసారము నుంచి తరిస్తారు.ఇందులో ఎలాంటి అనుమానంలేదు.
No comments:
Post a Comment