సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం।
వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి॥28॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము
కృష్ణుడు అర్జునుడికి అరటి పండు ఒలిచి నోట్లో పెడుతున్నట్లు చెపుతున్నాడు.అర్జునా! భగవంతుడు అనేవాడు సర్వ భూతాలలోనూ సమంగా ఉంటాడు.అతనికి ఒకరు ఎక్కువ,ఇంకొకరు తక్కువా కాదు.ఒకటి ఎక్కువ,ఇంకొకటి తక్కువా కాదు.ఆ భూతాలు నశించినా తాను మటుకు నాశనం కాడు.అంటే సర్వ ప్రాణికోటి నశించినా,తాను మాత్రం అజరామరంగా,శాశ్వతంగా ఈ చరాచర సృష్టి ఉన్నంత వరకూ ఉంటాడు.అలాంటి పరమేశ్వరుడిని చూడగలిగినవాడు మాత్రమే నిజమైన ద్రష్ట.
No comments:
Post a Comment