ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః।
పరమాత్మేతి చాప్యుక్తో దేహేఽస్మిన్ పురుషః పరః॥23॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!భగవంతుడు మన దేహంలోనే ఉంటాడు.అతనినే పరమాత్మ అని అంటాము.కానీ దేహానికి అతీతుడు.ఆ విశ్వేశ్వరుడు,పరంథాముడు,పరమాత్మ స్వతంత్రుడు.ఈ జగత్తుకంతా అనుకూలంగా అనుమతిని ఇచ్చేవాడు.ఈ విశ్వంలో జరిగే ప్రతి చిన్న కదలికకు కూడా సాక్షిమాత్రుడు.సర్వ జగత్తును పోషించేవాడు,పాలించేవాడు.ఈ సృష్టికి అంతా యజమాని అతనే.ఈ చరాచర జగత్తును అంతా పర్యవేక్షిస్తుంటాడు.అతడు దివ్య భోక్త.
No comments:
Post a Comment