Sunday, 18 May 2025

ఏతైర్వి ముక్తః కౌంతేయ

ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రి భిర్నరః। ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాంగతిః॥22॥ శ్రీమద్భగవద్గీత...షోడశోధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము కృష్ణుడు అర్జునుడితో ఇలా విశదీకరిస్తున్నాడు.పరీక్షలో ప్రతి తప్పుకు _మార్కులు ఉన్నాయి అంటే తప్పులు రాయకుండా ఉంటేనే కదా కనీసం సున్నా వచ్చేది.ఆ తరువాత సరిగా వ్రాసిన జవాబులకు +లో మార్కులు వచ్చేది.అలాగే ఇక్కడ కూడా.కౌంతేయా!మానవుడు ముందు నరకానికి రాచమార్గాలు అయిన కామాన్ని,క్రోథాన్ని,లోభాన్ని విడనాడాలి.వేరే గత్యంతరము లేదు.అవి విసర్జిస్తేకానీ మనసు తపస్సు,యోగము వైపుకు మనసు మరలదు.తపస్సు,యోగములను అకుంఠిత దీక్షతో పాటిస్తేకానీ ఆత్మజ్ఞానం కలుగదు.ఆత్మజ్ఞానం కలిగితేకానీ మోక్షం పొందలేడు.కాబట్టి వీటిని అన్నిటినీ ఒకదాని తరువాత ఇంకొకటి చేపట్టి మన మార్గం సుగమం చేసుకోవాలి,మోక్షం పొందాలి.

No comments:

Post a Comment