Wednesday, 28 May 2025

కట్వామ్ల లవణాత్యుష్ణ

కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష్ణరూక్ష విదాహినః। ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః॥9॥ శ్రీమద్భగవద్గీత..।।సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి రాజసులకు ఏది ప్రీతికరమో చెబుతున్నాడు.వాటి పర్యవసానం కూడా చెబుతున్నాడు.అర్జునా!ఇప్పుడు ఇంక రాజసులు ఎలాంటి ఆహారం ఇష్ట పడతారో చెబుతాను.వాళ్ళు చేదు,పులుపు,ఉప్పులు,కారాలు ఎక్కువగా ఇష్టపడతారు.ఇంకా అతివేడి,అతి కారం,ఎండి పోయినవి,దాహంకలిగించే ఆహారమంటే మక్కువ చూపిస్తారు.వీటిని వాళ్ళు ఇష్టంగా తింటారు.ఈ ఆహారపు అలవాట్ల వలన కార్యక్రమేణ పరిణామావస్థలో దుఃఖాన్నీ,వ్యాకులతను మూటకట్టుకుంటారు.ఇవి చాలా మటుకు రోగకారకాలు.కాబట్టి రోగాల బారిన పడుతుంటారు.

No comments:

Post a Comment