శ్రీ భగవానువాచ...
త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా।
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు॥2॥
శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి వచ్చిన అనుమానాలన్నిటినీ ఓపికగా విన్నాడు.ఇంక సందేహ నివృత్తి చేసేదానికి నడుము బిగించాడు.అర్జునా!ఈ ఆత్మలు మనష్యులు చిరుగిన బట్టలు మార్చినట్లుగా శరీరాలను మారుస్తాయి అని చెప్పాను కదా!కాబట్టి ఎవరికి వారికి వారి వారి పూర్వజన్మల వాసనలు ఉంటాయి.ఆ పూర్వజన్మల వాసనలను అనుసరించి ప్రాణులకు సహజంగానే సాత్త్విక,రాజస,తామస గుణాలు,లేక వాటి పట్ల శ్రద్ధ,మక్కువ ఏర్పడతాయి.వాటిని అన్నిటి గురించి చెబుతాను,విను.
No comments:
Post a Comment