Wednesday, 21 May 2025

యే శాస్త్ర విధి ముత్సృజ్య

అర్జున ఉవాచ... యే శాస్త్ర విధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః। తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వ మాహో రజస్తమః॥1॥ శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము కృష్ణుడు చెప్పిందంతా అర్జునుడు మనసు లగ్నం చేసి విన్నాడు.మంచి విద్యార్ధులకే అనుమానాలు వస్తాయి.ఎందుకంటే వాళ్ళలో గురువు చెప్పేదంతా ఆకళింపు చేసుకోవాలనే తపన ఉంటుంది.ఆ క్రమంలోనే అనుమానాల దొంతరలు బయటపడతాయి.వీటన్నిటికీ గురువు అనేవాడు ఓపికగా సందేహ నివృత్తి చేయాలి.అప్పుడే ఆగురుశిష్యుల బంధం బలపడుతుంది.శిష్యుడు మంచిగా ఎదిగేదానికి దోహద పడుతుంది. ఇక్కడ కూడా అలాగే అర్జునుడు తనకు వచ్చిన అనుమానాలు,సందేహాలను అన్నిటినీ కృష్ణుడి ముందు ఉంచుతున్నాడు. కృష్ణా!హే యాదవా!శాస్త్ర విధులను అందరూ సరిగ్గా నిర్వర్తించలేరు కదా!ఒక్కొక్కసారి అతిక్రమించాల్సి వస్తుంది కదా!అతిక్రమిస్తారు కూడా.అలా శాస్త్ర విధిని అతిక్రమించినప్పటికీ కూడా శ్రద్ధతో పూజలు చేసేవారు ఏ కోవలోకి వస్తారు?వారు సాత్త్వికులా,రాజసులా లేక తామసులా?వారి ఆచరణ ఎలాంటిది?

No comments:

Post a Comment