Saturday, 24 May 2025

యజన్తే సాత్త్వికా దేవా

యజన్తే సాత్త్వికా దేవా న్యక్షరక్షాంసి రాజసాః। ప్రేతా న్భూత గణాం శ్చాన్యే యజన్తే తామసా జనాః॥4॥ శ్రీమద్భగవద్గీత..।సప్తదశాధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము సర్వ ప్రాణికోటికీ భగవంతుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువు మానవాకారంలో శ్రీకృష్ణుడుగా జన్మించి,సహవాసి అయిన అర్జునుడితో యుద్ధభూమిలో నిలబడి ఇలా అంటున్నాడు.అర్జునా!నేను నీకు ఇప్పుడే మూడు రకాలు అయిన శ్రద్ధలగురించి ప్రస్తావించాను కదా!అవే సాత్త్విక,రాజస,తామస శ్రద్ధలు.అలా ఎందుకు ఆ ఆ శ్రద్దలు అలా ఉత్పన్నమవుతాయో చెబుతాను,విను.సహజంగా సాత్త్వికులు దేవతలను పూజిస్తారు.కాబట్టి వారికి సాత్త్వికమయిన శ్రద్ధలు అలవరుతాయి.అదే రాజసులు యక్షరాక్షసాదులని పూజిస్తారు.కావున వారికి రాజస పరమయిన శ్రద్ధలు ఏర్పడతాయి.చివరికి తామసుల గురించి చెప్పుకుందాము.వీరు భూతప్రేతాలను పూజించేదానికి మక్కువ చూపిస్తారు.అలాగే వాటిని పూజిస్తుంటారు.తదనుగుణంగా వారికి తామస శ్రద్ధలు ఉత్పన్నమవుతాయి.

No comments:

Post a Comment