అసత్య మప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్।
అపరస్పరసంభూతం కి మన్య త్కామహైతుకమ్॥8॥
శ్రీమద్భగవద్గీత..షోడశాధ్యాయము
దైవాసుర సంపద్విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి ఈ ఆసురీ స్వభావంకల వారి గురించి చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావంకల వారు ఈ ప్రపంచం అంతా మిధ్య అంటారు.అంతేనా?ఈ జగత్తు అంతా అస్థిరం అని కూడా అంటారు.దేవుడు,దైవం అనే వాళ్ళు ఎవరూ లేరని బల్ల గుద్ది మరీ చెబుతారు.సృష్టికి మూల కారణం స్త్రీ పురుష సంయోగం తప్ప ఇంకొకటి కాదు,లేదు అని నొక్కి వక్కాణిస్తారు.కామం తప్ప ఇక వేరే ఏ కారణాలు లేవని గట్టిగా నమ్ముతారు.
No comments:
Post a Comment