బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్।
బుద్ధి ర్బుద్ధి మతా మస్మి తేజ స్తేజస్వినా మహమ్॥10॥7॥
శ్రీమద్భగవద్గీత..।విజ్ఞాన యోగము....
శ్రీకృష్ణుడు అర్జునుడికి అన్ని ఉదాహరణలు సహేతుకంగా చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!నేను ఇప్పుడే చెప్పాను కదా అగ్నిలోని తేజస్సు నేనే,తాపసులలోని తపస్సు నేనే,ప్రాణులలోని ప్రాణం నేనే ఇని.ఇవే కాకుండా అన్ని ప్రాణులూ ఈ భూమి మీద బతికి బట్ట కట్టేదానికి కావలసిన మూలకారణము,అదే బీజము నేనే!బుద్ధి మంతులలోని బుద్ధి నేనే!ధైర్యవంతులలోని ధైర్యాన్ని నేనే!ఇవన్నీ నీవు తెలుసుకుంటే మంచిది.
No comments:
Post a Comment