ఏతద్యోనీని భూతాని సర్వాణీ త్యుపధారయ।
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయ స్తథా॥6॥7॥
శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మాండము సృష్టి లయలకు తనే మూలాథారము అని చెబుతున్నాడు.అర్జునా!ఓ భరతశ్రేష్ఠా!నీకు తెలుసా?సర్వభూతాలూ కూడా ఈ పరా,అపరా ప్రకృతుల నుంచే పుట్టాయి.ఈ ప్రపంచము,ఈ విశ్వము యొక్క సృష్టి నా చేతుల మీదుగానే జరిగింది.దీనిని లయము చేసేది కూడా నేనే!ఈ రెండిటి మధ్యలో ఉండే స్థితిని కూడా నేనే నడుపుతాను.అంటే ప్రతిదీ,చీమ చిటుక్కుమన్నా కూడా,నా ఆజ్ఞ లేకుండా జరగదు.ఎందుకంటే సర్వస్వానికీ కారణభూతుడను నేనే!
No comments:
Post a Comment