యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్
తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే॥14॥
శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడితో చెబుతున్నాడు.మంచి మార్గములో నడిచే వాళ్ళకు ఎప్పుడూ మంచే జరుగుతుంది.అన్ని గుణాలలోకి సత్త్వగుణము మంచిది అని నీకు నేను చెప్పాను కదా!ఆ గుణము వృద్ధిలో వున్నప్పుడు మరణం సంభవిస్తే,మనము ఉత్తమలోకాలకు పోతాము.మాములుగా బ్రహ్మ జ్ఞానులకు ఉత్తమలోక ప్రాప్తి దక్కుతుంటుంది.కాబట్టి ప్రతి ఒక్కరూ సత్త్వగుణము అలవరుచుకుంటే మంచిది.
No comments:
Post a Comment