Wednesday, 26 February 2025

ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థాః

ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణ వృత్తిస్థాః అధో గచ్ఛంతి తామసాః॥18॥ శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగయోగము కృష్ణుడు అర్జునుడికి ఏ గుణాలు పాటిస్తే,ఏ ఫలితాలు దక్కుతాయో చెబుతున్నాడు.అర్జునా!నీకు ఈ మూడుగుణాలగురించి చెప్పానుకదా.వాటి పర్యనసానంఎలా వుంటుందో,ఏమిటో చెబుతాను.సత్త్వగుణం ఆచరించే సాత్త్వికులకు ఉత్తమమయిన ఊర్ధ్వలోకాలు సంప్రాప్తిస్తాయి.రజోగుణం పాటించే రాజులకు మానవలోకం దక్కుతుంది.అంటే మళ్ళీ మళ్ళీ మానవజన్మమే దక్కుతుంది.మోక్షం దక్కదు.తమోగుణానికి బానిసలు అయిన తామసులకప నీచమయిన అధోగతులు కలుగుతాయి.అనగా మానవ జన్మకంటేకూడా తక్కువ అయిన పశు,పక్ష్యాదుల జన్మ దక్కుతుంది.

No comments:

Post a Comment