Sunday, 23 February 2025
రజసి ప్రళయం గత్వా
రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే
తథా ప్రలీన స్తమసి మూఢయోనిషు జాయతే॥5॥
శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.రజోగుణము వృద్ధిలో ఉన్నప్పుడు మరణిస్తే ఏమి జరుగుతుందో చెప్తాను విను.అలాంటి మనిషికి కర్మలయందు ఆసక్తి వుంటుంది కనుక,మరలా మానవజన్మనే పొందుతాడు.ఇప్పుడు తమోగుణము గురించి మాట్లాడుకుందాము.తమోగుణము అంటే అజ్ఞానానికి,అలసత్త్వానికి పెట్టింది పేరు.కాబట్టి తమోగుణము వృద్ధిలో ఉన్నప్పుడు మరణం సంభవిస్తే,ఆ ప్రాణికి పశువు,పక్షిల జన్మమే దక్కుతుంది.కాబట్టి మన ఆలోచనలు,నడవడిక,ఆత్మజ్ఞానము మనకు తరువాత దక్కబోయే జన్మలను కూడా నిర్దేశిస్తాయి.కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోని మసలుకుంటే,అన్ని వేళలా ఉత్తమము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment