సత్త్వం సఖే సంజయతి రజః కర్మణి భారత!
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత॥9॥
శ్రీమద్భగవద్గీత....చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు ఇంతదాకా తను చెప్పిన దానికి సారాంశం చెబుతున్నాడు.ఓ భరతశ్రేష్టా!అర్జునా!సత్త్వగుణం అనేది జీవుడిని సుఖబద్థుడిగా చేస్తుంది.రజోగుణం కర్మమార్గంలో ప్రయాణించేలా చేస్తుంది.తమోగుణం అనేది జ్ఞానాన్ని దూరం చేసి,అజ్ఞాన మార్గం వైపుకు మొగ్గేలా చేస్తుంది.దీని పర్యవసానంగా మానవుడు ప్రమాదాలకు లోనవుతాడు.ఎందుకంటే అతను తప్పులు మీద తప్పులు చేసుకుంటూ పోతాడు.ఎక్కడా ఆగి ఆత్మశోథన చేసుకోడు.
No comments:
Post a Comment